కేసీయార్, పీవీ మన ఠీవి - తెలుగు మాత ముద్దు బిడ్డ శ్రీ పి.వి. నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,577; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* తొలి తెలుగు ప్రధాని, అపర చాణుక్యుడు, బహుభాషావేత్త, రచయిత, ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి

* 9 భారతీయ భాషలు, 8 విదేశీ భాషలు

* కేంద్ర మైనారిటి ప్రభుత్వాన్ని, 5 ఏళ్ళు నడిపిన చాణుక్యుడు
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

భారత పూర్వ ప్రధాని, తెలుగు (నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మరియు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ శ్రీ పి.వి. నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జూన్ 28, 2020 నుండి జూన్ 28, 2021 వరకు.

దేశ ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి ఆర్థిక రంగాన్ని ఒక మలుపు తిప్పిన ధీశాలి. అపర చాణక్యుడు, తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పివి (పాములపర్తి) నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

ఇప్పటి వారికి తెలియక పోవచ్చు, ఆయన గొప్పతనము గురించి. భారత దేశ స్ధాయిలో చక్రం తిప్పిన తెలుగు రాజకీయ మేధావి, స్తిత ప్రజ్ఞుడు. ఆనాడు ఢిల్లీలో మిగత ప్రధానుల కు ఉన్న విధముగా, పీవీ గారికి మాత్రము స్మారక సమాధి కి అవకాశము లేకుండా చేసిన కాంగ్రెస్స్. కాంగ్రెస్స్ మరచిపోయిన ప్రధాని పీవీ, నేడు కేసీయార్ గుర్తు చేసి, మరలా వెలుగులోకి తెచ్చారు, సంవత్సర వేడుకలు జరుపుతూ. దేశ దేశాలలో ఉన్న తెలుగు వారు కూడా, స్మారక సభలు చేస్తున్నారు.

భారత దేశ ప్రధాని పదవిని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి, అపర చాణుక్యుడు, బహుభాషావేత్త, రచయిత మన పి.వి .భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించిన ఘనుడు, మన పీవీ నరసింహారావు గారికి శత జయంతి దినోత్సవ శుభాకాంక్షలు.

మనం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలని కోరుకుంటున్నాము.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని శ్రీ పీవీ. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

మాజీ ప్రధాని దివంగత శ్రీ పివి నరసింహారావు గారి పేరు మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ సిఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

* 28 జూన్ 1921 వరంగల్, ఉమ్మడి ఆంధ్ర (ఇప్పుడు తెలంగాణ)
* న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు, 9 వ భారత ప్రధానిగా 1991 - 1996.
* స్వాతంత్ర సమర యోధుడుగా, భారత జాతీయ కాంగ్రెస్స్ తో కలసి, స్వాతంత్ర ఉద్యమము లో పాల్గొన్నారు.
* ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రిగా, భూ చట్టాలను తెచ్చారు.
* 9 భారతీయ భాషలు మరియు 8 విదేశీ భాషలు
* లుక్ ఈస్ట్ పాలసి ద్వారా భారత్ కు గుర్తింపు తెచ్చారు
* మొదటి ప్రధాని, కేంద్ర మైనారిటి ప్రభుత్వాన్ని, 5 ఏళ్ళు నడిపిన చాణుక్యుడు
* 23 డిశెంబర్ 2004 ఢిల్లీ లో శివైక్యము చెందారు.  
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,577; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158
Dt : 28-Jun-2020, Upd Dt : 28-Jun-2020, Category : News
Views : 2617 ( + More Social Media views ), Id : 22 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pv mana theevi , telugu mother great son , pv narasimha rao , satha jayanti celebrations , telangana , cm kcr

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content