1.
బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత.. ఎవరీ సామ్రాట్ చౌదరి? - 2026-04-14T16:25:17+05:30
బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయన వారసుడిగా బిజేపీ నేత పగ్గాలు చేపట్టబోతున్నారు. బిహార్లో మొదటిసారి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారు. నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేట్ కావడంతో.. సీఎంగా ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది.
ఇంకా
2.
వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసు ప్రవర్తన.! - 2026-04-14T16:36:58+05:30
జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖపట్నం నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీఐటీయూ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే.. వెనువెంటనే వారికే ఇచ్చేయటం, ఈ సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఇంకా
3.
సంగారెడ్డిలో విషాదం.. పోలీస్ వాహనం దూసుకురావడంతో ASI మృతి, డ్రైవర్ పరారీ - 2026-04-14T16:35:15+05:30
సంగారెడ్డిలో ఘోర విషాదం నెలకొంది. విధుల్లో ఉన్న ఏఎస్ఐపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ ఏఎస్సై తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే ఆ పోలీస్ వాహనాన్ని ఓ హోంగార్డు డ్రైవ్ చేయగా.. ఈ ఘటన తర్వాత అతడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో పరారీలో ఉన్న హోంగార్డును పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఇంకా
4.
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచనున్నారా? ఆ రోజే ముహూర్తం..! - 2026-04-14T13:59:48+05:30
Hormuz Blockade: ఇరాన్ యుద్ధం ప్రభావంతో భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రవాణాకు అవాంతరాలు ఎదురు కావడంతో చమురు, గ్యాస్ దిగుమతులపై ప్రభావం పడుతోంది. దీని కారణంగా ఇప్పటికే గ్యాస్, ప్రీమియం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరి కొద్ది రోజుల్లోనే సామాన్యులు వాడే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడం ఖాయమనిపిస్తోంది.
ఇంకా
5.
వరుసగా 4 రోజూ అప్పర్ సర్క్యూట్.. 21 శాతం పెరిగిన విమాన సంస్థ స్టాక్.. కారణం ఏంటి? - 2026-04-14T16:17:12+05:30
SpiceJet Share: ఏవియేషన్ సెక్టార్లోని లార్జ్ క్యాప్ కేటగిరి కంపెనీ స్పైస్ జెట్ లిమిటెడ్ షేరు గత 4 ట్రేడింగ్ సెషన్లలో అప్పర్ సర్క్యూట్స్ కొడుతోంది. దీంతో ఈ నాలుగు సెషన్లలోనే ఏకంగా 21 శాతానికి పైగా లాభాన్ని అందించింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ విమాన సేవలతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు సైతం అందిస్తోంది. రూ.50 లోపు ధర గల ఈ పెన్నీ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
ఇంకా
6.
భారత జట్టులోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బద్దలు కొట్టాల్సిందే..! - 2026-04-14T16:29:24+05:30
ఐపీఎల్లో విధ్వంసకర ఓపెనింగ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. జూన్ 2026లో ఐర్లాండ్తో జరిగే రెండు టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ ఇతడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైభవ్.. సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. సచిన్ 16 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున డెబ్యూ చేశాడు.
ఇంకా
7.
‘ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిని తుఫానుగా మార్చొద్దు’ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి స్టాలిన్ వార్నింగ్ - 2026-04-14T15:45:08+05:30
ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను పెంచే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టే ఉద్దేశంతో ఉంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారని, 50 శాతం సీట్లను పెంచితే ఇక తమ అవసరమే ఉండదని ఆందోళన చెందుతున్నారు. తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.
ఇంకా
8.
సిమెంట్, స్టీల్, ఇసుక లేకుండానే.. పాత పద్ధతిలో మోడ్రన్ ఎకో ఫ్రెండ్లీ ఇల్లు.. ఆర్కిటెక్ట్ అద్భుతం.. - 2026-04-14T15:42:29+05:30
ఇల్లు నిర్మించాలంటే స్టీల్, సిమెంట్, కంకర, ఇసుక వంటివి అవసరం. కానీ ఇవేవీ లేకుండానే పాతకాలం నాటి పద్ధతులలో ఇల్లు నిర్మించారు ఆర్కిటెక్ట్ కరుణాకర్ రెడ్డి. మూడున్నర వ్యవధిలోనే పాత పద్ధతిలో మోడ్రన్ ఎకో ఫ్రెండ్లీ ఇల్లు నిర్మించారు. ఈ విధానంలో సహజ వనరుల వినియోగం 70 శాతం తగ్గుతుందని చెప్తున్నారు. ఇల్లు కట్టే స్థలంలోని మట్టిని ఉపయోగించి, ఇలాంటి పర్యావరణహిత ఇల్లు కట్టినట్లు తెలిపారు.
ఇంకా
9.
లీటర్ పెట్రోల్పై రూ.18, డీజిల్పై రూ.35 లాస్.. ప్రభుత్వ చమురు కంపెనీలకు భారీ నష్టం! - 2026-04-14T15:26:36+05:30
Petrol Price: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచలేదు. నెలన్నరగా క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నా ఇక్కడ ధరలు పెంచకపోవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. లీటర్ పెట్రోల్ పై రూ.18, లీటర్ డిజిల్ పై రూ.35 మేర నష్టం వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంకా
10.
అడ్డంగా నరుకుతం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్.. మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ - 2026-04-14T15:25:07+05:30
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుకుతం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా హెచ్చరికలు చేయడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు.
ఇంకా