1.
ఇప్పటికీ తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల పంపకాలు, వారసత్వ సమస్యలున్నాయి.. పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు - 2026-06-15T16:15:46+05:30
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలను కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య వారసత్వ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్తుల పంపకాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఇంకా మారలేదని.. అందుకే జనసేన సభకు అనుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇంకా
2.
నా బాధను అర్థం చేసుకోండి.. అలాంటి కామెంట్లు పెట్టొద్దు.. దండం పెట్టి వేడుకున్న జ్ఞానేశ్వరి తల్లి.. - 2026-06-15T16:07:34+05:30
కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ వీడటం లేదు. చిన్నారి కనిపించకుండా పోయి పది రోజులైంది. చిన్నారి కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. అయినా కూడా పాప ఆచూకీ తెలియడం లేదు. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క కూడా చనిపోవటం పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది పెడుతున్న కామెంట్లు, వీడియోలు.. తమ ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని పాప తల్లి భవానీ వాపోయారు. దయచేసి అలాంటి కామెంట్లు పెట్టొద్దంటూ వేడుకున్నారు.
ఇంకా
3.
‘కుంకుమ భాగ్య’ నటి సంచిత ఆత్మహత్య.. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఇన్స్టా వీడియో - 2026-06-15T16:19:06+05:30
ప్రముఖ టీవీ సీరియల్ నటి సంచిత ఉగాలే ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సూపర్ హిట్ సీరియల్ ‘కుంకుమ భాగ్య’ (తెలుగులో ‘కుంకుమ భాగ్యం’) లో దియా టాండన్ పాత్రతో పాటు ‘వాగ్లే కి దునియా’ వంటి షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబై పరిసర ప్రాంతమైన నలసోపరాలో నివసిస్తున్న సంచిత.. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నారని సమాచారం.
ఇంకా
5.
హైదరాబాద్: ఆరేసిన బట్టల నుంచి నీరు కారడంతో ఇరుగుపొరుగు మధ్య గొడవ.. రంగంలోకి భారీగా పోలీస్ బలగాలు - 2026-06-15T16:17:27+05:30
ఆరేసిన తడి బట్టల నుంచి నీరు కిందకు కారడంపై రెండు కుటుంబాల మధ్య అర్థరాత్రి మొదలైన వాగ్వాదం.. క్షణాల్లోనే పరస్పర దాడుల వరకు వెళ్లింది. దీంతో తీవ్రంగా భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే స్వయంగా భారీ బలగాలతో రంగంలోకి దిగి గొడవను ఆపారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి మరీ.. దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగానే డీసీపీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంకా
6.
ఐపీఓకు UPI పేమెంట్స్ సంస్థ.. రూ.6000 కోట్ల సమీకరణ లక్ష్యం.. సెబీ వద్దకు పత్రాలు! - 2026-06-15T15:51:15+05:30
Razorpay IPO: ప్రముఖ యూపీఐ పేమెంట్ల యాప్ రేజర్ పే తొలి పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమైంది. ఫిన్టెక్ రంగం నుంచి పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఫోన్పే ప్రయత్నాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు రేజర్ పే వస్తుండడం గమనార్హం. కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీ వద్ద ముసాయిదా పత్రాలను సమర్పించినట్లు సమాచారం. దాదాపు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు నిధులను సమీకరించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇంకా
7.
తృణమూల్ తిరుగుబాటులో కొత్త ట్విస్ట్.. రెబల్స్ చేరికపై ఎన్సీపీఐ నేత యూటర్న్ - 2026-06-15T15:55:31+05:30
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనం కావాలని నిర్ణయిం తీసుకున్నట్టు ప్రకటించారు. దీంతో అంతగా గుర్తింపులేని ఎన్సీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే, ఈ విలీనాన్ని తాను, తమ నేతలు వ్యతిరేకిస్తున్నట్టు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ వ్యాఖ్యానించారు. కానీ, ఆయన తన నిర్ణయాన్ని 24 గంటల్లోనే మార్చుకోవడం గమనార్హం.
ఇంకా
8.
కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - 2026-06-15T15:12:44+05:30
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించారు. చిన్న చలిచీమలు సైతం బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయన్న పవన్ కళ్యాణ్.. ఇలాంటి ఆలోచనలు చేసే వ్యక్తులు దేశ సమగ్రతను బలిచేయడానికి సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. ఈ ప్రవాహంలో జనసైనికులు చిక్కుకోవద్దనే ఉద్దేశంతోనే ఢిల్లీలో సమావేశం పెట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇంకా
9.
‘మా రూ.1.13 లక్షలు కోట్లు మాకిచ్చిన తర్వాతే చర్చలు’.. ఒప్పందంపై ఇరాన్ కొత్త మెలిక - 2026-06-15T15:08:34+05:30
యావత్తు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోని నెట్టేసిన అమెరికా - ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు ముగింపు పడనుంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ.. ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందంపై ఈ వారంలో సంతకాలు చేయనున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి కొత్త చిక్కు వచ్చి పడింది. స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని కోరాయి.
ఇంకా
10.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన పీఎం మోదీ.. చారిత్రాత్మక నిర్ణయమంటూ పోస్ట్ - 2026-06-15T15:26:04+05:30
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి రావడం పట్ల అంతర్జాతీయంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మైలురాయి లాంటి దౌత్యపరమైన పరిణామాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. జూన్ 19వ తేదీన స్విట్జర్లాండ్ వేదికగా అధికారికంగా సంతకాలు కానున్న ఈ ఒప్పందం.. గల్ఫ్ జలాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి, అంతర్జాతీయ చమురు మార్కెట్కు ఎలా ఊరటనివ్వబోతుందో మోదీ తెలిపిన వివరాలు మీకోసం.
ఇంకా