1.
తెలంగాణలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ.. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు.. అన్ని శాఖలకు ఆదేశాలు - 2026-02-27T22:14:37+05:30
తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపడుతోంది. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. సమన్వయంతో అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తూ.. క్షేత్ర స్థాయిలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా మార్చి 2 నుంచి జూన్ 9 వరకు ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నారు. ఎన్నికల హామీలు, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలకు రానున్న వంద రోజుల్లో అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు.
ఇంకా
2.
డాక్టర్ రాతతో పనిలేదు.. నోటి మాట చాలు.. ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా స్పీచ్ టు టెక్ట్స్ విధానం .. - 2026-02-27T22:04:50+05:30
ఏపీ ప్రభుత్వం వైద్య సేవలలో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇస్తోంది. విజయవాడ , గుంటూరు సర్వజన ఆస్పత్రులలో స్పీచ్ టు టెక్ట్స్ విధానం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. చేతి రాతతో అవసరం లేకుండా ఈ విధానం పరీక్షిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఈ విధానం పరిశీలిస్తున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఓపీ, రోగుల వివరాలు, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అన్నీ డిజిటల్ రూపంలోకి మారనున్నాయి.
ఇంకా
3.
పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం.. కివీస్పై ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ..! - 2026-02-27T22:45:07+05:30
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. సూపర్-8లో భాగంగా శుక్రవారం కొలంబోలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ ఓటమితో న్యూజిలాండ్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం నాటి మ్యాచ్లో శ్రీలంకను.. పాకిస్థాన్ భారీ తేడాతో ఓడిస్తే.. సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
ఇంకా
4.
ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐకి చుక్కెదురు.. మరి ఈడీ విచారణ ఏమవుతుంది? - 2026-02-27T22:08:31+05:30
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు.. సీబీ దర్యాప్తు తీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. సీబీఐ అనుసరించిన విధానాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కేజ్రీవాల్ను సీబీఐ కంటే ముందు ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా కోర్టు సీబీఐ కేసులో తీర్పు చెప్పడంతో మరి ఈడీ కేసులో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇంకా
5.
కేపీహెచ్బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం - 2026-02-27T21:33:59+05:30
కేపీహెచ్బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ ధర పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇంకా
6.
"నేను ఆరోగ్యంగానే ఉన్నా, ఆందోళన వద్దు".. బొత్స సత్యనారాయణ - 2026-02-27T14:15:06+05:30
మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోగ్యంపై అప్డేట్ వచ్చింది. తాను ఆరోగ్యంగా ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బొత్స ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. మరోవైపు బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని.. దీంతో ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అయితే రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగానే తాను ఆస్పత్రికి వచ్చినట్లు బొత్స క్లారిటీ ఇచ్చారు.
ఇంకా
7.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చిట్.. స్పందించిన అన్నాహజారే - 2026-02-27T21:19:03+05:30
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై కే్జ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హాజారే స్పందించారు. కోర్టు తీర్పును గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను గతంలో తన శిష్యుడిపై చేసిన విమర్శలకు కూడా వివరణ ఇచ్చారు. అప్పట్లో కోర్టు తీర్పు రాలేదని ఆయన అన్నారు.
ఇంకా
8.
KBR పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్లు.. హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సజ్జనార్ - 2026-02-27T20:51:48+05:30
హైదరాబాద్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీపీ సజ్జనార్ వెల్లడించారు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. కేబీఆర్ పార్కు చుట్టూ రానున్న 2 ఏళ్లలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్పాస్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా రాత్రివేళల్లో పనులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.
ఇంకా
9.
‘కేరళ స్టోరీ 2’ మూవీకి హైకోర్టులో ఊరట.. విడుదలకు గ్రీన్ సిగ్నల్ - 2026-02-27T21:24:04+05:30
‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతినిచ్చింది. సినిమాలో అభ్యంతరకర కంటెంట్ ఉందంటూ గతంలో సింగిల్ బెంచ్ విధించిన రెండు వారాల స్టేను కోర్టు రద్దు చేసింది. దీంతో ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, వాయిదా పడినప్పటికీ ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఇంకా
10.
మాజీ మావోయిస్ట్లతో రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ ప్రభుత్వ పాలన బాగుందని ప్రశంసలు - 2026-02-27T19:45:42+05:30
ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్లు.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలన బాగుందని దేవ్జీ ప్రశంసించారు. జైళ్లలోని మావోయిస్టులను కలిసి లొంగుబాట్లపై మాట్లాడుతామని పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచంలో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తామని దేవ్జీ వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇంకా