ప్రేమ తో రఘురామ 4వ లేఖ, జగనన్న హామీని గుర్తు చేస్తూ? ఇదంతా సమంజసమేనా? స్వతంత్ర అభ్యర్థిగా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,702; 104 తత్వాలు (Tatvaalu) and views 226,312.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఢిల్లీ ఓ 4 గురు ఎంపీ లు వెళ్ళి
* ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ
* ఎంపీ భరత్ తో పంపారు
* రఘురామ ను జైల్ లో వేసి, ఇబ్బంది, సానుభూతి
* చంద్రన్న ఎమ్మెల్యేలు రాజీనామా
* జనసేన ఒక్క ఎమ్మెల్యే
* జగనన్న సలహాదారులు కూడా, వేగముగా
* 151 మెజారిటీ సాధ్యమేనా, 2024 లో?
* ఇంకో దిక్కు లేక, రేపు చంద్రన్న
* గవర్నర్, సీయెం, ఎంపీ లకు లేఖలు
* సుజనా రమేష్, బీజేపీ
* తొలి లేఖలో వృద్ధాప్య వింతతు
2 min read time.

* * * ఏదో తన పని తాను చేస్తుకుంటూ, విమర్శల వీడియోలతో గోల పుట్టిస్తున్న, రఘురామ ను అలా వదిలేయకుండా, విపరీత పబ్లిసిటీ ఇద్దామన్న అర్ధం లేని ఉత్సాహముతో, గతము లో ప్రత్యేక విమానము లో, ఢిల్లీ ఓ 4 గురు ఎంపీ లు వెళ్ళి, ఆర్భాటము గా ఫోటోలు పెట్టారు.

అందులో మా ప్రాంత అభివ్రుద్ది పట్టించుకోని, జగనన్న ఇచ్చిన నాయకత్వ అవకాశాన్ని వాడుకోలేని, మాకు పార్లమెంట్ లో ఏదీ అడిగి తీసుకు రాలేని, మా బాపట్ల యువ ఎంపీ కూడా ఉన్నారు.

ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ, అందుకే ఆ పని ముందుకు కదలదు.

మరలా, మొన్న భరత్ తో పంపారు, రాజీనామా చూడమని.

ఆ రోజే అన్నాము, అనవసరము గా పెద్దది చేస్తున్నారు, ఇంత మంది వెళ్ళడం ఎందుకు, రాజు గారికి పబ్లిసిటీ ఇవ్వడం కోసం? ఓ ఎంపీ తో ఓ లేఖ స్పీకర్ కు పెట్టిస్తే సరిపోతుంది కదా అని, మన మాట ఎవరు వింటారు? జరిగేది జరగాలి కదా.

* * * ఇప్పుడు రఘురామ ను జైల్ లో వేసి, ఇబ్బంది పెట్టి, గందర గోళం చేసి అత్యుత్సాహముతో, దేశమంతా ఆయన పేరు మారు మోగేటట్లు చేసి, ప్రజలలో సానుభూతి పెంచారు, కింద కోర్టు నుంచి సుప్రీం దాకా పరుగులతో, వ్రుధా శ్రమ ఖర్చు తో.

* * * చంద్రన్న ఎమ్మెల్యేలు ను మనం తీసుకుని, రాజీనామా చేయించామా, 2 ఏళ్ళుగా? హాపీ గా, మన సొంత వైసీపీ వాళ్ళనే, తొక్కేసి, తెదేపా వారితో కులకటం లేదా? జనసేన ఒక్క గా నొక్క ఎమ్మెల్యే రాపర్ల కూడా, పవనన్న ను అవమానించ లేదా? మనం సభలో హేళన చేయించ లేదా?

మన దుప్పట్లో అందరినీ దాచి, రాజీనామాలు ఆపలేదా? 151 ఎమ్మెల్యేలు ఉండి, ఈ కక్కుర్తి మనకు అవసరమా, అని, జగనన్న క్షేమం కోరే వారు ఒక్కరూ లేరా? వీరు చెప్పినా, జగనన్న వినడం లేదా? తెలియదు.

* * * షేం (సేం) టు షేం (సేం), ఆనాడు చంద్రన్న సలహా దారులు, అధికారం తో విర్రవీగి, ఎన్ని పనికి రాని పనులు చేసి చేపించి, అనుభవజ్ఞులైన చంద్రన్న ను 23 సీట్లతో నడి రోడ్ మీద వేశారో చూసాం. అదే ప్రయత్నము లో, జగనన్న సలహాదారులు కూడా, వేగముగా తమ వంతు పిచ్చి పనులు, తాము నిబద్దత తో చేస్తున్నారు.

* * * అందరూ బీహార్ గాంగ్ వల్ల గెలిచారు, అనుకుంటున్నారు కోట్ల ఖర్చు తో, పల్లెటూరు జనాలకు సోషల్ మీడియా పట్టు ఉంటుందా? 151 మెజారిటీ సాధ్యమేనా? 2024 లో వస్తుందా? అది అద్రుష్టం. కానీ చంద్రన్న మీద అసహ్యం తో గెలిచాము, ఆయనకు జనసేన పొత్తు లేక, అని వైసీపీ కి ఇప్పటికీ అర్ధం కావడం లేదు.

ఇంకో దిక్కు లేక, రేపు చంద్రన్న గెలిచినా, అది వైసీపీ లోని వైఫల్యము తో మాత్రమే. చంద్రన్న మీద నమ్మకం తో మాత్రం కాదు. కరోనా సమయము లో, ఆంధ్రా ప్రజలను గాలికి వదిలి, హైదరాబాద్ లో తండ్రి కొడుకులు సేద తీరుతున్నది, ఎవరూ మరువరు. కనీసం తెదేపా తమ్ముళ్ళు కూడా, ప్రభుత్వ ఆసుపత్రుల ఇబ్బందులు పట్టించుకోలేదు.

మరలా పాత రాయి తో కొట్టించుకోవాలో లేక 3 వ కొత్త మనిషి, రాయో కాదో పనితనము చూద్దాము అనుకుంటారో, అది ప్రజల ఇష్టం. ఎందుకంటే, మన రాత రాసుకునేది మనమే, మన ఓటుతో.

* * * రఘురామ ను తప్పు పట్ట లేము, ఇప్పుడు. అవమానాల తో అనుభవం పెరిగి, చాలా జాగ్రత్త గా, గవర్నర్ లకు, సీయెం లకు, ఎంపీ లకు, అందరికీ లేఖలు రాసేస్తున్నారు, ఫలితం ఏదైనా, ప్రయత్నం చేస్తున్నారు.

ఎంతో ధనం చేతులు మారి, తిరిగి ఇవ్వకపోతే, నేనెందుకు సీట్ వదలాలి అంటే, ఎవరి దగ్గర జవాబు లేదు.

అసలు సీట్లు అమ్ముకోని పార్టీ ఉందా, ధనం వర్గం కులం అవసరం కు అమ్ముడుబోని ఓటరు ఉన్నారా?

పాపం చిరంజీవి, ప్రజారాజ్యం పై పడ్డారు అప్పుడు. ఉచితము గా ఎంపీ సీట్లు తీసుకుని, సుజనా మరియు రమేష్, బీజేపీ లోకి వెళితే, చంద్రన్న గమ్ముగా ఉన్నారు అంటే, నమ్ము తారా?

5 ఏళ్ళు జనాలకు పనికి రాకుండా, సొంత వ్యాపారాలలో మునిగి ఉన్న, ఎంతో మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీ లు ఉన్నారు. ఈయన ఒక్కడి వలన, కొత్త నష్టం ఏముంది? ఇంకా ప్రజలకు ఆసక్తికర వినోదం గా ఉంది.

* * * జగనన్న కు వరుస లేఖలతో హామీలను గుర్తు చేస్తున్నారు, వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణరాజు.

మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా, గుర్తు చేసి, అన్ని హామీలను నెరవేర్చాలి. రఘురామ పనిని మరియు పబ్లిసిటీని తగ్గించాలి, కానీ వీరు గమ్ముగా ఉంటున్నారు.

రాజద్రోహం కేసులో అరెస్టై, బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి మరింత దూకుడు పెంచారు. జగనన్న బెయిల్ రద్దు చేయమని, సుప్రీం లో కేసు విషయం తెలిసిందే కదా.

వైసీపీ వెబ్ సైట్‌లో ఎంపీల జాబితా నుంచి, తన పేరు తొలగించారని, వైసీపీ నుంచి తనను బహిష్కరించారా? తనని సస్పెండ్‌ చేస్తే, సమాచారం కోరారు. 48 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే, తనను స్వతంత్ర అభ్యర్థిగా, ప్రకటించాలని స్పీకర్‌ను కోరుతానన్నారు.

కొరివి తో తల గోక్కోవడం, అందరూ చేస్తున్నారు, అసలు అభివ్రుద్ది పక్కన వేసి. బలప్రయోగం ఎప్పుడు ఎవరికీ మంచిది కాదు.

ఇప్పుడైనా, కేసులు పగలు కక్షలు వదిలి, అభివ్రుద్ది గురించి ఆలోచన చేస్తే, మంచిది. అప్పులు ఇక దొరక్కపోతే, పరిస్థితి ఏమిటి?

* * * గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 8,402 పోస్టులు, పశుసంవర్ధక శాఖలో 6,100 పోస్టులకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. 18 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుళ్ల పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా వదిలేశారు. వందల సంఖ్యలో సెక్రటేరియట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ అయినా కోర్టు కేసుల కారణంగా వీటిలో అంతంత మాత్రమే నియమాకాలు జరిగాయి

ఎన్నికల ప్రచారంలో మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఆశను ఇప్పటివరకు నెరవేర్చలేదు. అత్యవసరం కింద తీసుకుని వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలి - అని జగనన్న కు రాసిన లేఖలో ఎంపీ రఘురామ ప్రస్తావించారు.

* తొలి లేఖలో వృద్ధాప్య మరియు వింతతు పింఛన్ల పెంపు

* రెండో లేఖలో ఉద్యోగులు చాలా కాలంగా పోరాడుతున్న సీపీఎస్ రద్దు

* మూడో లేఖలో పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ విషయం మనకు తెలుసు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,702; 104 తత్వాలు (Tatvaalu) and views 226,312
Dt : 13-Jun-2021, Upd Dt : 13-Jun-2021, Category : Politics
Views : 834 ( + More Social Media views ), Id : 1203 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ycp , rebel , raghurama , rrr , 4th , love , letter , reminding , jagananna , promises , good
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content