ఘోరీ పృథ్విరాజ్ చౌహాన్ మధ్య 22 యుద్ధాలు, 21 సార్లు రాజపుత్ సామ్రాట్ చౌహాన్ గెలిచి ఘోరీకి క్షమాభిక్ష - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,143; 104 తత్వాలు (Tatvaalu) and views 226,138.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Remembering the brave son of the soil, the great icon of valour, courage and chivalry, #PrithvirajChauhan on his birth anniversary

ధైర్యసాహసాలు కలిగిన భూమి పుత్రుడు, పరాక్రమం, ధైర్యసాహసాలు, పరాక్రమాలకు గొప్ప చిహ్నం #పృథ్వీరాజ్ చౌహాన్ జయంతి సందర్భంగా.

The strength and patriotism of Prithviraj Chauhan will inspire generations to come.

పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క శక్తి మరియు దేశభక్తి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.

1947 స్వాతంత్రం తర్వాత, కాంగ్రెస్స్ ప్రభుత్వాలు చేసిన ఎన్నో క్షమించరాని, చరిత్ర ద్రోహము లో, ఇది కూడా ఒకటి. గొప్ప గా పోరాడిన, హైందవ వీరుల చరిత్ర గురించి పాఠ్యపుస్తకాలలో పూర్తి గా రాయకుండా, మొఘలులు లేదా, ఇతరుల గురించి గొప్ప గా రాసి, తూతూ మంత్రము గా హిందూ రాజుల గురించి రాశారు.

కేంద్ర విద్యా మంత్రులు దాదాపుగా హిందువులు కారు, చరిత్ర చూడండి. ఒకవేళ అయినా కూడా, కాంగ్రెస్స్ అధిష్టానము, హిందువులను గొప్ప గా చిత్రీకరించడానికి ఒప్పుకోదు. ఎందుకంటే హిందు ముస్లిం మతం ప్రాతిపదిన పాకిస్తాన్ ఇండియా విడిపోయాయని అందరము చదువుకున్నాము. కానీ భారత్ ను హిందు రాజ్యం గా గుర్తించనీయకుండా చేసింది కాంగ్రెస్స్ మాత్రమే. సెక్యులర్ అన్న పదము కావాలని తగిలించి ఆనాడు.

పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192 సా.శ.) రాజపుత్ర వంశమైన చౌహాన్ (చౌహమాన) వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు. పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి. (చివరి హిందూ చక్రవర్తి హేమూ).

11 ఏళ్ల వయసులో 1179లో సింహాసనాన్ని అధిష్టించిన పృథ్వీరాజు అజ్మీరు, ఢిల్లీలు జంట రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలోని చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో ఉండేది. ఈయన ముస్లిం దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశాడు. అందుకు గాను రాజపుత్ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ అన్న బిరుదును పొందినాడు.

పృథ్వీరాజ్ కనౌజ్ ను పరిపాలించిన ఘడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త (సంయోగిత) ను లేవదీసుకొని పోయి పెళ్ళి చేసుకోవటం భారతదేశపు జనసాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమకథ. పృథ్వీరాజు ఆస్థానకవి, స్నేహితుడైన చంద్ బర్దాయ్ వ్రాసిన, పృథ్వీరాజ్ రాసో, అనే కావ్యం కథపై ఆధారితమైనదే.

పృధ్వీరాజ్ విజయం ఆయనకు 6 భాషలలో ప్రావీణ్యం ఉందని సూచించింది. పృథ్వీరాజ్ రాసో 14 భాషలను నేర్చుకున్నాడని వివరిస్తుంది. చరిత్ర, గణితం, ఔషధం, సైనిక, పెయింటింగు, తత్వశాస్త్రం (మీమాంస), వేదాంతశాస్త్రం వంటి అనేక అంశాలలో అతను బాగా ప్రావీణ్యం పొందాడని రసో వ్యాఖ్యానించాడు. ఈ రెండు రచనల్లో ఆయన విలువిద్యలో ప్రత్యేకంగా నైపుణ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి.

1191లో షాహ‌బుద్దీన్ మ‌హ‌మ్మ‌ద్ ఘోరీ ఇరాన్ నుంచి 1.20 ల‌క్ష‌ల మంది సైనికుల‌తో కైబ‌ర్ క‌నుమ‌ల గుండా పంజాబ్ స‌రిహ‌ద్దు ప్రాంతంలోకి ప్ర‌వేశించాడు. ఢిల్లీని ఎలాగైనా ఆక్ర‌మించాల‌నేది అత‌ని వ్యూహం. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ కూడా త‌క్కువేం తిన‌లేదు. అత‌ని వ‌ద్ద 1 ల‌క్ష మంది మెరిక‌ల్లాంటి సైనికులు ఎప్ప‌టికీ సిద్ధంగా ఉండేవారు.

కాగా తారెయిన్ (హర్యానాలో, ప్ర‌స్తుత ఢిల్లీకి 150 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది) అనే ప్రాంతంలో ఘోరీ త‌న సైన్యంతో వ‌చ్చి పృథ్వీరాజ్ చౌహాన్ కు స‌వాల్ విసిరాడు. దీంతో చౌహాన్ ఘోరీతో యుద్ధం చేశాడు. అయితే విజ‌యం చౌహాన్‌నే వ‌రించింది. కానీ ఘోరీ అనేక విధాలుగా ప్రాధేయ‌ప‌డ‌డంతో చ‌లించిపోయిన చౌహాన్ ఇత‌రులు వ‌ద్దంటున్నా విన‌కుండా ఘోరీని విడిచిపెట్టాడు. అదే అత‌నికి మృత్యుపాశ‌మైంది.

మ‌రుస‌టి ఏడాది 1192లో ఘోరీ 1.20 ల‌క్ష‌ల మంది సైనికుల‌తో మ‌ళ్లీ చౌహాన్‌పై యుద్ధం చేసేందుకు దండెత్తి వ‌చ్చాడు. ఈ సారి చౌహాన్ 150 మంది రాజుల‌ను ఏకం చేసి, 3 ల‌క్ష‌ల మంది సైనికులు, 3వేల ఏనుగుల‌తో ఘోరీపై యుద్ధానికి దిగాడు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ చౌహాన్ ఈసారి ఘోరీపై ఓడిపోయాడు. చౌహాన్‌తోపాటు అత‌ని స్నేహితుడు చాంద్ బ‌ర్దెయ్ కూడా ఘోరీకి చిక్కాడు. వీరిద్ద‌ర్నీ ఘోరీ యుద్ధ ఖైదీలుగా ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని పెషావ‌ర్‌కు తీసుకెళ్లాడు.

అక్క‌డ చౌహాన్‌ను నానా అవ‌స్థ‌ల‌కు గురి చేశాడు. అనేక క‌ష్టాలు పెట్టాడు. భ‌గ భ‌గ మండే అగ్ని కీల‌ల‌తో క‌ళ్ల‌లో పొడిచే స‌రికి చౌహాన్ గుడ్డి వాడ‌య్యాడు. కాగా ఒకానొక సంద‌ర్భంలో ఘోరీ విలువిద్య‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌మ‌ని చౌహాన్‌ను స‌భా స్థ‌లిలో నిల‌బెడ‌తాడు. అత‌నికి బాణాలు, విల్లును ఇస్తారు. అదే స‌మ‌యంలో చాంద్ బ‌ర్దెయ్ చౌహాన్‌కు వినిపించేలా ఘోరీ ఉన్న ప్ర‌దేశాన్ని పాట రూపంలో చౌహాన్‌కు చెబుతాడు.

దీంతో చౌహాన్ అప్ర‌మ‌త్త‌మై బాణం వేస్తాడు. అది స‌రిగ్గా వెళ్లి ఘోరీకి తాకుతుంది. దీంతో అత‌ను మ‌ర‌ణిస్తాడు. అనంత‌రం చాంద్ బ‌ర్దెయ్ చౌహాన్‌ను చంపి, తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ఇదీ ఢిల్లీ చివ‌రి హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ‌.

అయితే నేటి తరం వారు మాత్రం చౌహాన్ నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది. అదేంటంటే… ఎంత‌టి దీనావ‌స్థ‌లో ఉన్నా, ఎన్ని క‌ష్టాలు ఎదురైనా త‌న‌కు కూడా ఎప్పుడో ఒకప్పుడు స‌మ‌యం వ‌స్తుంద‌ని చౌహాన్ అనుకున్నాడు, అలాగే వ‌చ్చింది, దాన్ని స‌రిగ్గా వాడుకుని ఘోరీని అంత‌మొందించాడు, అదీ అత‌ని జీవితం నుంచి మ‌నం నేర్చుకోవాల్సింది..!

ప్రబంధ చింతామణి అనే పుస్తకంలో మాత్రం ఘోరీ పృథ్విరాజ్ చౌహాన్ మధ్య 22 యుద్ధాలు జరుగగా 21 సార్లు చౌహాన్ గెలిచి ఘోరీకి క్షమాభిక్ష పెట్టి వదిలేసాడని 22వ యుద్ధంలో పరాజయం పొందారని రాసి ఉంది. ముఖ్య గమనిక.. చరిత్ర చేరిపేసిన వేల సత్యాలలో ఇది ఒకటి

ఎర్రకోట కట్టింది 1060 లో అనంగపాల్ అనే హిందూ రాజు ఢిల్లీ నీ పాలించిన రాజులు చరిత్ర ఎక్కిన స్వయాన పృధ్వీరాజ్ చౌహాన్ రాజు యొక్క తాత గారు....

ఇప్పటికీ, ఎప్పటికీ ఈ దేశం ముమ్మాటికీ హిందువులదే....ఇది జగమెరిగిన సత్యం...ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే జమనా కాదు, ఒక చెంప మీద కొడితే అలా కొట్టిన వాడి తల తీసే జమాన అంటారు పెద్దలు, హైందవ పౌరుష యుద్ద వీరులు, చత్రపతి శివాజీ లాంటి వారు.

seakaraNa mualam vikeepeeDiya te.wikipedia.org
Ghori Prithviraj Chauhan 22 wars, 21 times Rajput Samrat Chauhan won Ghori was pardoned  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,143; 104 తత్వాలు (Tatvaalu) and views 226,138
Dt : 04-Jun-2022, Upd Dt : 04-Jun-2022, Category : General
Views : 1184 ( + More Social Media views ), Id : 1415 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ghori , prithviraj , chauhan , wars , rajput , samrat
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content