1.
రేవంత్ రెడ్డి ఆ హామీ నెరవేరిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: హరీష్ రావు - 2024-04-24T17:37:21+05:30
Harish Rao: లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ఆ హామీని నెరవేరిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా దూరంగా ఉంటానని తెలిపారు. ఒకవేళ హామీ నెరవేర్చకపోతే సీఎం పీఠం నుంచి దిగిపోతారా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఇంకా
3.
Ap Elections Live Updates: పోలీస్ కస్టడీకి సీఎం జగన్పై రాయిదాడి కేసు నిందితుడు సతీష్ - 2024-04-24T05:34:39+05:30
AP Assembly Election 2024 News Live Updates: ఆంధప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నెల 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇటు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియనుంది. ఇటు కూటమి తరఫను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. పోలింగ్కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏపీ ఎన్నికల లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
ఇంకా
4.
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర.. 17 రోజులు 12 నియోజకవర్గాల్లో గులాబీ బాస్ ప్రచారం - 2024-04-24T16:52:57+05:30
KCR Bus Yatra: తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం బస్సు యాత్రను చేపట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన ఈ కేసీఆర్ బస్సు యాత్ర.. 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. 12 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు.
ఇంకా
5.
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు.. జగన్కు మద్దతుగానేనా.. ఇంతమందా? - 6+05:30
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికలకు, సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను ఇప్పటికే దూరం పెట్టారు. దీంతో చాలా మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వాలంటీర్ల రాజీనామాలు అంటూ నిన్నమొన్నటి వరకూ రోజూ వార్తలు కనిపిస్తూనే ఉన్నా్యి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎంతమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారనే దానిపై వివరాలు వెల్లడయ్యాయి. ఎన్నికల సంఘం ఈ వివరాలను హైకోర్టుకు సమర్పించింది
ఇంకా
6.
టెన్త్ క్లాస్లో 93.5 శాతం మార్కులు.. రిజల్ట్స్ చూసి ఆస్పత్రి పాలైన విద్యార్థి - 2024-04-24T16:05:19+05:30
SSC Results: విద్యార్థులు అన్నింటికన్నా భయపడేది పరీక్షలు.. ఆ తర్వాత వచ్చే ఫలితాలకే. అయితే ఓ విద్యార్థికి మాత్రం ఊహించని మార్కులు వచ్చాయి. పాస్ అయితే అదే పది వేలు అనుకున్న ఆ విద్యార్థికి ఏకంగా 93.5 శాతం మార్కులు వచ్చాయి. ఇంకేం ఎగిరి గంతేశాడా అనుకుంటున్నారా. అదేం లేదండీ.. ఆ మార్కులు చూసి మూర్ఛపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్పించారు.
ఇంకా
7.
ఎన్నికల వేళ కేంద్రం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు అమల్లోకి.. నిజమేనా? - 2024-04-24T16:45:43+05:30
దేశంలో సార్వత్రిక ఎన్నికల సుదీర్ఘ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. మరో రెండు రోజుల్లో రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరుగుతుంది. జూన్ 1తో పోలింగ్ ప్రక్రియ ముగియనుండగా.. జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎన్నికల సందర్భంగా కేంద్ర కొత్త కమ్యూనికేషన్ మార్గదర్శకాలను తెచ్చిందనేది దాని సారాంశం. అయితే, అది నిజం కాదని, ఫేక్ అని తేలింది.
ఇంకా
9.
చంద్రబాబు వ్యాఖ్యలకు హర్ట్.. టిప్పర్ నడుపుతూ వచ్చి నామినేషన్ - 2024-04-24T16:09:05+05:30
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నామినేషన్ల గడువు సమీపిస్తూ ఉండటంతో అభ్యర్థులు అందరూ నామినేషన్లు దాఖలు చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసిన తీరు ఆసక్తికరంగా మారింది. టిప్పర్ వాహనాన్ని నడుపుకుంటూ ఆర్వో కార్యాలయానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి.. నామినేషన్ దాఖలు చేశారు. టిప్పర్ డ్రైవర్గా పనిచేసిన వీరాంజనేయులుకు వైసీపీ టికెట్ ఇవ్వగా.. ఆయన ఇలా సింబాలిక్గా తాను టిప్పర్ డ్రైవర్ అని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇంకా
10.
ఇల్లు కొనుగోలుదారులకు కేంద్రం శుభవార్త.. పీఎం ఆవాస్ యోజన పరిధి, సబ్సిడీ పెంపు? - 2024-04-24T15:49:03+05:30
PMAY: సొంతిటి కల నెరవేర్చుకోవాలని భావిస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. గృహ కొనుగోలుదారులకు రాయితీ అందించేందుకు తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన పరిధి, సబ్సిడీని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. సబ్సిడీ పెంచితే చాలా మంది ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంకా