జగన్ పరువు తీస్తూ పవన్ పై సానుభూతి పెంచుతున్న వైసీపీ నాయకులు - పీకే లేక పీచ్ఛే ప్లానా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,762; 104 తత్వాలు (Tatvaalu) and views 224,985.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

జగనన్న తన పాలన అభివ్రుద్ది మీద నమ్మలేక, పిచ్చి ఆంధ్రా జనాలు, బీహార్ పీకే (ప్రశాంత్ కిషోర్) గ్రూప్ లాంటి వారి మాయలు విన్యాసాలకే లొంగిపోతారు అని, పీకే ను మరలా తెస్తున్నారని లేదా ఆల్రేడి పని మొదలు అయ్యిందని అభిజ్ఞవర్గాల భోగట్టా. మరి అది వికటించి, వెనక్కు పడేస్తుందా అన్నది వేచి చూడాలి.

అందుకే పవన్ మీద విరుచుకు పడుతూ, వార్త ల లో చంద్రన్న ఊసు లేకుండా చేయాలన్న, విశ్వ ప్రయత్నం అని సమాచారం.

వైసీపీ ఏకాదశ పధకాల స్టార్ కాంపైనర్లు, కొడాలి నాని, పేర్ని నాని, పోసాని, . . . ఇతరుల తో, నేలపై అభివ్రుద్ది గురించి కాకుండా, యువతకు ఆదర్శ బూతుల విమర్శలతో వినోదం కలిగిస్తున్నారు.

అమ్ముడుపొయిన పక్షపాత మీడియా కూడా, సభ్యత సంస్కారం వదిలి, ఆ బూతుల విమర్శలనే అతి ముఖ్యమైన ప్రజా వార్తలు గా నిత్యం హోరెత్తిస్తున్నారు, యువత మదిలో విషం నింపుతున్నారు, తెలుగు జాతి విలువలను ఇంకా దిగజారుస్తూ. ఇప్పుడు చైతన్య సమంత వ్యవహారం తో బిజీ, జనాల క్షేమం గాలికి వదలేసి.

వ్యక్తిగత విషయాలు, నీతి ధర్మం దమ్ము ఉన్న నాయకులు మాట్లాడరు. కానీ విషయం లేని నాయకులు కు ఏమి మాట్లాడాలో తెలీదు కదా? అన్ని పార్టీ ల అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.

కుల పార్టీలు గా వైసీపీ మరియు తెదేపా నాయకులే, ఒకరిపై ఒకరు ముద్రలు వేసుకుంటూ, 400 మంది పైగా అధికారులు నాయకుల లిస్ట్ లను ప్రజలకు పంచుతూ, ఇతరులపై కూడా, కుల ముద్ర వేయ ప్రయత్నాలు. సీట్లు అమ్ముకోని పార్టీ లేదని, కానీ ఇతరుల పై మాత్రమే ఆ ముద్ర వేయాలని తాపత్రం, అని సమాచారం.

గతము లో చంద్రన్న సీయెం గా, జగనన్న పర్యటనలకు స్వేచ్చ ఇచ్చి ఓదార్పు యాత్ర చేయించినా, ఇప్పుడు జగనన్న మాత్రం, చంద్రన్న మరియు పవనన్నల పర్యటనలను అడుగు అడుగునా అడ్డుకుంటూ, తమ పాలన మీద నమ్మకం లేని తనాన్ని, దొల్ల తనాన్ని బయట పెడుతునారని కొందరు అభిమానులు భావిస్తున్నారు.

అలాగే చంద్రన్న కూడా, తన సత్తా మీద లోకేష్ సామర్ధ్యం పై నమ్మకము లేక, పీకే గ్రూప్ నుంచి ఓ తాను ముక్క ప్రచారము తో, మరియు వీలైతే పవన్ తోక పట్టుకుని, ముందుకు దూకుదామని ప్రయత్నమని సమాచారం.

ఉదాహరణ గా, చీరాల నియోజకవర్గములో, 33 వార్డులలో అభ్యర్ధులను కూడా నిలపలేని దుస్తితిలో పెట్టిన నాయకులను, మార్చాలంటే లేదా దమ్మున్న నాయకులను తేవాలంటే, చంద్రన్న లోకేషన్న వలన కావడం లేదు. ఆ స్థానిక తెదేపా సోషల్ మీడియా పరిస్థితి చూడండి.

పట్టణ గ్రామ బీజేపీ జనసేన దుస్థితి కూడా అంతే, సోషల్ మీడియా లో పార్టీ పేజీలకు, స్థానిక సమాచారం అందించే, నాయకులను పట్టుకోలేరు ఇంకా.

పట్టపగ్గాలు లేని అభిమానులను, ఓటర్లు గా చేసుకోవడము లో, విఫలం అవుతున్నారు. కానీ ప్రజలకు, కొత్త అభ్యర్ధి ఇంకొకరు కాన రావడం లేదు, క్లీన్ చిట్ తో.

రాష్ట్రం లో ఆస్తులు అమ్మి మరియు తాకట్టు పెట్టి మరియు ఆఖరికి చెత్త పై కూడా పన్నులు వేసి మరియు కరెంట్ పాత లోటుకు అదనపు చార్జీలు వేసి, కొంతమంది బడుగులకు అందిస్తున్న నవ రత్నాల తో పాటుగా, ఇంకో 2 దశమ ఏకాదశ రత్నాలను కూడా రాష్ట్రప్రజల అందరుకూ సమముగా ఉచితముగా అందిస్తూ కూడా, బయటకు చెప్పడం లేదు, నిగర్వి మా జగనన్న అంటూ, వైసీపీ అభిమానులు అచ్చెరువునొందుతున్నారు.

నాయకుడు అంటే, అలా ఉండాలి, అడగకుండానే అన్ని ఇవ్వాలి తన అనుచరులకు, భవిష్యత్ లో తాము పార్టీ మారినప్పుడు, అన్నను కూడా అలాగే విపరీతముగా పొగడటానికి.

నాటి చంద్రన్న రాజ్యం లో ఉన్న భావ స్వేచ్చ, మన వైసీపీ పాలన లో కూడా ఉండాలి. చంద్రన్న కు జగనన్న కు తేడా ఉండకూడదు, కొత్త సీసాలో పాత సారా లాగే చేస్తున్నాము అని అనుకుంటున్నారు.

చంద్రన్న ను ఏ విధముగా నేలకు దింపి, తలకెక్కిన గర్వమును ప్రజలు అణిచారో, మన జగనన్న ను కూడా అలాగే దింపాలి అని, 151 ఎమ్మెల్యేలే స్థానాల అధికార మదముతో, అధికార వైసీపీ నాయకులు పోటీలు పడుతున్నారు, అని శ్రేయోభిలాషులు నోరు నొక్కుకుంటున్నారు.

ఇంతకీ దశమ రత్నం ఏమిటో తెలుసా, కల్లు తాగిన కోతిలా, విచ్చలవిడిగా మితిమీరి రెచ్చిపోయి చేస్తున్న, ఉచిత బూతు విమర్శలు, పిల్లలు యువతకు ఆదర్శముగా.

అదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, జగన్ తర్వాత, ఉన్న మార్పుకు ఆశాజనకం పవన్ మాత్రమే అని చెప్పకనే చెపుతూ సానుభూతి పెంచుతున్నారు.

పవన్ అధికారములో లేరు, కానీ సన్నాసి అన్న పదాన్ని తీసుకొని, ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణం తో రాగ ద్వేషాలు మరచి పాలన చేస్తామని చేసిని ప్రమాణాన్ని మరచి, తాము లక్షల మందికి ప్రతినిధులము అని, అధికారము లో ఉన్నా అహంకారం లేకుండా అణిగి ఉంటామన్న ఆదర్శాన్ని, గాలికి వదిలి, నోటికి వచ్చిన విధముగా మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో మమ్మల్ని క్రమశిక్షన కట్టిడి చేసే దమ్ము నాయకత్వానికి లేదని లేదా నాయకత్వం అధికారమత్తులో జోగుతుంది అని, సవాలు చేస్తూ నిరూపించారు.

ఏకాదశ రత్నము గా, ఉచిత అధిక పన్నులు. కనిపించిన దాని మీదల్లా పన్ను వేసి, బొటా బొటి ఆదాయ మార్గము పెంచడమే, ఇంకో మార్గం కనపడదు.

పిచ్చి జనాలు, పన్నులు కట్టక చస్తారా ఎన్నుకున్నాక? జగనన్న రావాలి పన్నులతో మన ఆదాయం లాక్కోవాలి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయాలి అని, ప్రజలు పడ్డ తపన, తమ నాయకుడు తీరుస్తున్నారు అని, అభిమానులు ఆనందముగా ఉన్నారు.

చంద్రన్న, జగనన్న, ఇన్నాళ్ళు అన్ని రాష్ట్ర సంపద తాకట్టు పెట్టి లేదా అమ్మి లేదా అప్పులు తెచ్చి, రాష్ట్రాన్ని ఆర్ధిక పతన ఊబిలోకి నెడుతున్నాప్పుడు, వారికి ఉన్న స్టేలు, కేసులు, ఆస్తులు చూసి, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే సామర్ధ్యం లేదని తెలిసి కూడా, అవకాశం ఇచ్చినప్పుడు, ఇంకో కొత్త వ్యక్తికి కొత్త కుటుంబానికి కొత్త కులానికి, అవకాశం ఇస్తే తప్పు ఏమిటి అన్న ఆలోచన, ప్రజలలో తెప్పిస్తున్నారు అని కొందరు అంటున్నారు.

ఇంకొంతమంది లేదు, తమ ఆస్తులు పెంచుకుంటూ, తమ కేసుల నుంచి స్టేలతో రక్షణ కల్పించుకుంటూ, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడము లో, ఆర్ధికము గా కుంగ దీయడములో, రాష్ట్రాన్ని ఇంకొక వెనిజులా దేశ ఆర్ధిక పరిస్థితి లా దివాలా చేయడము లో, చంద్రన్న కు మించి జగనన్న తన క్రుషి చేస్తున్నారు, అన్ని పధకాలకు తమ లేదా తండ్రి (గతం లో చంద్రన్న మామ) పేరు పెడుతూ, కాబట్టి ఈ పతనం ఇలాగే నిరంతరం కొనసాగాలి అంటే, ఇంకో 10 ఏళ్ళు ఇలాగే జగనన్న లేదా చంద్రన్న మాత్రమే, అధికారం లో ఉండాలి, వీరే సరైన నాయకులు, మన కుంచితపు వినాశన బుద్దికి, అని ఇంకొక వర్గము ఆశిస్తుంది.

కాబట్టి, ఎప్పటికైనా, మా (మన) పిల్లలు అంటే నాయకులది తప్పు కాదు, వారిని ఎన్నుకున్న మనలాంటి తప్పుడు ప్రజలదే తప్పు. మన బుద్ది మారందే, మనకు కొత్త నాయకులు కుటుంబాలు కులాలు రానిదే, జీవితాలు మారవు, అందరికీ అభివ్రుద్ది ఫలాలు అందవు.

కుల కార్పొరేషన్ లు పెట్టి, కులాలు ప్రోత్సహిస్తుంది ఎవరు? మరి సీయెం సీటు కూడా, ఆ కులాలకు 5 ఏళ్ళలో సమానము గా, పంచవచ్చును కదా నిజమైన ప్రేమ ఉంటే? డమ్మీ ఉపముఖ్యమంత్రులతో ఎవరికైనా లాభం ఉందా?

రామాయపట్నం పోర్ట్ ఏమైందో తెలీదు, కొత్తపట్నం లేదా చీరాల ఓడరేవు ఫిషింగ్ హార్బర్ ఎమైందో తెలీదు, చీరాల జిల్లా ఎమైందో తెలీదు, బాపట్ల మెడికల్ కాలేజ్ గోడలు లెగిసాయో లేదో తెలీదు, అసలు ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు.

జగనన్న అధికారులను, నాయకులను, ప్రభుత్వ ఆసుపత్రులు గ్రామ సచివాలయాలకు వెళ్ళమంటే, చెప్పిన వారం తర్వాత, వారు కదలరు, వీరు అడగరు.

ప్రతి రోజు కార్యక్రమాలు, సోషల్ మీడియాలో పెట్టమని, మనము మంత్రులను, అధికారులను అడుగుతుంటే, వారు కదలరు. అంతా అయోమయం జగన్నాధం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,762; 104 తత్వాలు (Tatvaalu) and views 224,985
Dt : 02-Oct-2021, Upd Dt : 02-Oct-2021, Category : Politics
Views : 730 ( + More Social Media views ), Id : 1256 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ycp , leaders , increasing , sympathy , pawan , defaming , jagan , pk
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content