విశ్వసనీయత క్రుతజ్ఞత దయయే స్వభావము - మహాభారతము కథ నాడీజంఘుడు క్షమాగుణం - భ్రష్టవిప్రుడు గౌతముడు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,942; 104 తత్వాలు (Tatvaalu) and views 224,922.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

విశ్వసనీయత క్రుతజ్ఞత దయయే స్వభావము - మహాభారతము లోని కథ నాడీజంఘుడు క్షమాగుణం - భ్రష్టవిప్రుడు గౌతముడు

కృతఘ్నత అనేది బ్రాహ్మణ (ఉత్తముని) హత్య కన్నా మహా పాతకం. కృతఘ్నుని శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు. చిన్నప్పుడు పాట్యపుస్తకాలలో చదివాము, కానీ మరచిపోయాము, ఎందుకంటే చదువులో మర్మము ఎరుగము ఆచరించము, కరోనాకు కూడా పనికి రాని ప్రాపంచిక మోహం సంపాదన తప్ప, మిగతా మనకు పట్టదు.

తమను జీవితం లో ఆదరించి, తమ అభివృద్ధి కి దోహదం చేసిన కొందరు మహామనీషులకు, అలాగే సొంత మరియు పెంచిన తల్లి దండ్రులకే, అలవోకగా ద్రోహం చేస్తారు కొందరు విశ్వాసహీనులు.

* మరి నేడు కన్న తల్లి దండ్రులకే కృతఘ్నత చూపించే నీచులైన ఆడ/ మగ పిల్లల గతి, మరి వారి విశ్వాసహీన సంతానము తరాల గతి?

* ఓటు ను అమ్ముకుని తమను తామే అమ్ముకునే ఓటర్లు, ఓటర్లను భూములను అలాగే తమ ఆత్మ ను అమ్ముకునే నాయకులు?

కుట్ర మోసం వెన్నుపోటు అకాలమరణం కరోనాలు కడగళ్ళు కన్నీళ్ళు బారేనా? మన బానిస మోసపు బుద్దులు ఆనాడే మన పెద్దలు స్పష్టముగా రాసి పెట్టారు.

నమ్మిన వారు ద్రోహం చేసినా, కొందరు పెద్దమనసుతో క్షమిస్తారు, వదిలేస్తారు. మంచి మనసున్న వారికి, పరోపకార జీవులకు, దేవతలు, రాక్షసులు కూడా మిత్రులు అవుతారు. అయితే ఇలాంటి నాడీజంఘులు, ఈ కాలం లో చాలా అరుదు.

అందుకే ద్రోహి కి ఎప్పుడూ, సహాయం చేయరాదు. మరలా సహాయం చేసిన వారి నెత్తినే చేయి పెడతారు.

మహాభారతము లోని కథ లో నాడీజంఘుడిని స్వర్గం తీసుకెళ్లడానికి ఇంద్రుడు తన సురభి (కామధేనువు) తో వచ్చాడు. అదే సమయంలో తన మిత్రుడికి శ్రద్ధాంజలి ఘటించడానికి విధాత కూడా అరుదెంచాడు.

సురభి తన దూడకు పాలు ఇస్తుండగా, ఆ పాల నురుగు గాలికి వెళ్లి నాడీజంఘుడి కళేబరం మీద పడ్డది. వెంటనే నాడీజంఘుడు మళ్ళీ బ్రతికాడు.

ఇంద్రుడు కోపంతో బ్రాహ్మణుని శిక్షించబోగా నాడీజంఘుడు వారించి అతనిని క్షమించమని కోరగా అందుకు ఇంద్రుడు అంగీకరించాడు.

భారతం లోని ఒక కథ. నాడీజంఘుడు ఒక బకశ్రేష్ఠుడు, కొంగ జన్మ ఎత్తినా, జ్ఞానసంపద, పూర్వజన్మ సువాసనలు, బుద్ధి బలం కలిగిన అత్యుత్తమ జీవి.

గౌతముడు అనే ఒక బ్రాహ్మణుడు, సహాయము చేసిన నాడీజంఘుడు అనే కొంగనే చంపి, విందు ఆరగిద్దాం అనుకుంటాడు.

ఇప్పుడు మన ఇళ్ళలో దాదాపు అందరూ గౌతము లే. అదే మంటే మా తాతల దగ్గర నుంచి వచ్చిన బుద్ది, అంత తేలికగా ఎలా పోతుంది, అంటారు.

నాడీజంఘుడు స్నేహితుడు రాజు విరూపాక్షుడు ఈ విషయము తెలిసి ఆగ్రహంతో గౌతముడ్ని చంపమని సేవకులకు ఆదేశాలు ఇచ్చాడు.

అటువంటి విశ్వాసఘాతకుడిని చంపితే తమకు మహాపాపం చుట్టుకుంటుంది అని సేవకులు నిరాకరిస్తారు.

అప్పుడు గౌతముని చీల్చి ముక్కలుముక్కలు చెయ్యమని తన పెంపుడు శునకాలను ఉసిగొల్పాడు విరూపాక్షుడు.

అయితే కృతఘ్నుడు యొక్క మాంసం ముట్టడం కూడా దోషం అని ఆ కుక్కలు కూడా అందుకు నిరాకరిస్తాయి.

కధ లో కి వెళితే, ఆకలిదప్పులతో వచ్చిన భ్రష్టవిప్రుని చూసి నాడీజంఘుడు జాలిపడి అతిథిభావముతో అతని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తి పఱచినాడు. తన పెద్ద రెక్కలను విసనకఱ్ఱ వలె వీచి సేదతీర్చాడు. అప్పటికే రాత్రి అవడముతో నాడీజంఘుడు విప్రాధమునితో ఇలా అన్నాడు - మహానుభావా! మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము.

ఇక్కడికి మూడుయోజనాల దూరములో మధువ్రజమనే రాజ్యమున్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైననూ పరమశాంతుడు ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్ము సత్కరించగలడు. ఱేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి.

ఒకవ్యక్తి ఆచరించే ధర్మాధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టముగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు పైగా రాజు అవడముతో బ్రాహణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీజంఘుని మిత్రుడు అని అతనిని సగౌరవముగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మోయలేనన్ని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజంఘుని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీజంఘుడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేదతీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమఱచి నిదుర పోయాడు.

మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది (సత్యసంధః కథలో సీతమ్మ చెప్పిన ఋషికథ ఇందుకు నిదర్శనము). కనుకనే భారతీయులు సద్భావ సత్ప్రవర్తనలను ఆచారముల ద్వారా వారి దైనందిన జీవితములలో అలవరచుకుని ఎల్లప్పుడు ధర్మమార్గముననే చరిస్తారు. దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు.

అట్లుకాక నిరంతరము కౄరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజంఘునిలో పతితబ్రాహ్మణునికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది!

బలిష్టమైన నాడీజంఘుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకొన్నాడు - రేపటి నుంచి నేను ఇల్లు చేరేలోపల మళ్ళి ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళతాను . వెంటనే దొడ్డుకఱ్ఱ తీసుకొని నాడీజంఘుని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసువులు బాసాడు నాడీజంఘుడు! చర్మం వొలిచి మాంసాన్ని మూటకట్టుకొని ప్రణాయమయ్యాడా దురితుడు.

ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాము:

మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు అయినా ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి.

నాడీజంఘుని (రాజధర్ముని) అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంఘుడు మనకు చూపినాడు.

Loyalty, gratitude and kind nature - Viprudu - Nadeejanghudu - story in Mahabharata  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,942; 104 తత్వాలు (Tatvaalu) and views 224,922
Dt : 13-May-2022, Upd Dt : 13-May-2022, Category : General
Views : 778 ( + More Social Media views ), Id : 1388 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : loyalty , gratitude , kind , viprudu , nadeejanghudu , story , mahabharata , king , virupaksha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content