చెరపలేని మచ్చ తో, తమ్ముళ్ళ మరియు పార్టీ ఆత్మ విశ్వాసము దెబ్బతీస్తున్న, చంద్రన్న నాయకత్వము - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,387; 104 తత్వాలు (Tatvaalu) and views 225,592.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చంద్రబాబు గారు అంటే, ఎత్తులకు పై ఎత్తు వేసే మాస్టర్ మైండ్, సమస్యను పరిష్కరించి మార్గము చూపే, లేదా సమాంతర సమస్యను స్రుష్టించ గలిగే, అనుభవశాలి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోని నిలబడ్డ సుదీర్ఘ రాజకీయ అనుభవము ఉన్న నాయకుడు. ఇది అంతా, గత వైభవము. కరోనా దెబ్బకు, మొత్తము దూరమైపోతుందేమో అని పార్టీ శ్రేణుల భావన.

ఒక్కోసారి, బాబు గారిని తప్పుదోవ పట్టించే వ్యక్తులు, పక్కన ఉంటారు. ఆయన, గుడ్డిగా వారి మాటలు విన్నారు, ప్రమాదములో పడ్డారు, చివరి ఎలెక్షన్ లో. ఇప్పుడు కూడా, దగ్గర వారు, ఆయనకు విషయము చెప్పి, కరోనా అప్పుడు, అమరావతి లేదా కుప్పము లో ఉంచవలసింది ఈ చివర 2 నెలలు.

జనము ద్రుష్టిలో ఇప్పుడు, వ్యాపారము లేదా కుటుంబము లేదా ప్రాణ భయముతో కోసము, జనాన్ని వదిలిన చంద్రన్న గా మిగిలారు. కానీ ఎవరూ నచ్చ చెప్పలేదు అధినాయకుడి కి లేదా లోకేష్ కి, అధికారములో ఉన్నప్పుడు చుట్టూ ఈగలుగా మూగి అనుభవించినవారు, ఇప్పుడు పట్టనట్లు గమ్ముగా ఉన్నారు.

కరోనా సమయములో, వైయెస్సార్ పార్టీ నాయకులు జనములో తోడూ నీడగా తిరుగుతూ ఉంటే, తెలుగు దేశము తమ్ముళ్ళు మాత్రము, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక పంచాయితీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు జనములో లేకుండా, రేపు ఓట్లు ఎలా అడుగుతాము, మన గెలుపుకు మనమే నష్టము చేసుకుంటున్నాము అని లోలోన కుమిలి పోతున్నారు.

ఒక వైపు జగన్ ప్రభంజనము ఎదుర్కోవటము కష్టముగా ఉంది, చంద్రన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు జగన్ వైపే లోపాయకారి గా ఉన్నారు. ఇలాంటి పరిస్తితిలో, 30 ఏళ్ళ పైగా అనుభవము ఉండి, ప్రజలకోసము చివరి రక్తపు బిందు చిందిస్తాను అన్న వ్యక్తి, చాలాసార్లు ముఖ్యమంత్రి గా మరియు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న అనుభవశాలి, ముందుండి సేనను నడపాల్సిన నాయకుడు ఆయన.

తమ లేదా శ్రేణుల తప్పు ఒప్పులను కప్పిపుచ్చుకుని ధైర్యముగా పోరాడాల్సిన నాయకుడు, కరోనా సమయములో ప్రజలతో పాటే చావైనా బతుకైనా అనాల్సిన పార్టీ మరియు ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రము బయట 2 నెలలకు పైన ఉండి, చెరపలేని మచ్చను తెచ్చారు పార్టీకి.

ఆంధ్రుల మరియు పార్టీ అభిమానాన్ని ధైర్యాని తాకట్టు పెట్టి, హైదరాబాదులో తండ్రి కొడుకులు, దూరముగా చాటుగా ఉండటము పార్టీకి తీరని నష్టము అని, అభిమానులు వాపోతున్నారు.

60 లలో ఉన్న మిగతా సీనియర్ నాయకులు, తమ ఆరోగ్యాల గురించి రక్షణ తీసుకుంటూ, జనాలతో కలుస్తున్నారు, ఉదాహరణకు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు, జేసీ దివాకర రెడ్ది గారు తదితరులు. చీరాల శాసన సభ్యులు కరణం గారు కూడా, అప్పుడప్పుడు జనాలను కలిసారు కరోనా సమయములో.

గతములో, 10 ఏళ్ళ గడువుకు ముందే హైదరాబాద్ నుంచి వచ్చినది, జనము మరచిపోలేదు. అలాగె, ఎలక్షన్ కి ముందు, జగన్ ని, ఆంధ్రా లొ ఇల్లు లేదు అని, ఇక్కడ ఉండటము లేదని చంద్రన్న ఎద్దెవా చేసారని, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఒక సామాన్య మహిళ, తెలంగాణా నుంచి డీజీపీ అనుమతి తీసుకుని, స్కూటర్ (చిత్రము 6) పై నెల్లూర్ వచ్చి, తన పిల్లవాడిని, తీసుకుని వెనక్కి వెళ్ళిన సంగతి ప్రజలందరకు తెలుసు.

మోడీ మాట గౌరవించి, లాక్ డౌన్ కోసము హైదరాబాద్ ఇంట్లో ఉన్నాను అన్న మాట, పార్టీ సభ్యులే హర్షించడము లేదు. రేపు, బీజేపీ నాయకులు, మీకు వయసు అయిపోయింది, మీరు ప్రతిపక్షనాయకునిగా సరిపోరు అంటే, సరేనని, తెలంగాణాలో ఉండిపోతారా?

చంద్రన్న కు ప్రజల బాధలు కష్టాలు తోడు నీడ ముఖ్యమా, లేక తన సుఖము లేదా తప్పించుకోవడానికి మాటలు ముఖ్యమా అని అభిమానులు బాధపడుతున్నారు. కనీసము, యువ నాయకుడు, లోకేష్ కూడా మంగళగిరి ప్రజలకు దగ్గరగా లేరు. ఎమ్మెల్సీ గా మంత్రి గా పని చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుని కొడుకు, తండ్రి పేరు బాధ్యతలు నిలబెట్టాల్సిన పుత్రుడు, కార్యకర్తల చిరు ఆశాదీపము, లోకేష్ కూడా ఇలా చేయడము అభిమానులకు నచ్చలేదు.

ఇక కుప్పము సంగతి అనుకోవడము అనవసరము, అక్కడ మా ఎమ్మెల్యే కనపడటము లేదని, కేసు కూడా పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు అన్నది కూడా, ప్రత్యర్ధులు తప్పు పడుతున్నారు. తమ వ్యాపారాలు ముఖ్యమని, ప్రజలను భర్తను వదలి అక్కడ ఉండబట్టే కదా, చంద్రన్న వెళ్ళాల్సి వచ్చింది. అదే మొత్తము కుటుంబము ఇక్కడ ఆంధ్రాలో ఉంటే, అక్కడకు వెళ్ళల్సిన పని లేదు కదా. ఒక వైపు, ప్రజలకు తన జీవితము సర్వస్వము అంకితము అని అంటూ, రెండో వైపు, కుటుంబాన్ని ఎలా అక్కడ ఉంచారు, అని చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రత్యర్ధులు అన్నట్లుగా, ఇక వయసు అయిపోయింది, ఇంక మాకు ప్రతిపక్షమే లేదు, లేదా బీజేపీ పవన్ మాత్రమే ఉన్నారు అనే దానిని, ఇప్పుడు చంద్రన్న నిజము చేసారు. 2 వారాలకు క్వారంటైన్ లో ఉన్నా కూడా, మిగతా నెలన్నర జనముతో ఉన్నాను అని చెప్పుకోవచ్చు. క్వారంటైన్ ఫోటోలు తో, పబ్లిసిటీ బాగా వచ్చేది కదా, అనవసరముగా పోగొట్టుకున్నాము అని, అభిమానులు బాధపడుతున్నారు.

ఇప్పుడైనా, ఆంధ్రాకు వచ్చి, ప్రజలతోనే ఉంటూ, అప్పుడప్పుడు వ్యాపారానికి తెలంగాణా పోయివస్తే బాగుంటుంది, అని అభిమానుల వాదన. కాని ఈ నష్టాన్ని పూడ్చటము మాత్రము, చిన్న విషయము కాదు అని సొంత పార్టీ వారి భావన.

ఒకవైపు, 150 రోజుల అమరావతి దీక్షలు (చిత్రము 5) సాగుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడు దగ్గర అండగా లేరు. అలాగే వైజాగ్ గాస్ ప్రమాదము (చిత్రము 4) అప్పుడు, కనీసము ఆంధ్రా లో లేరు. పక్క రాష్ట్రములో ఉండి, ఆన్లైన్ జూం వీడియో మీటింగులు (చిత్రము 3) పెడితే మరియు రాష్ట్రము బయట ఉండి జగన్ ను విమర్శిస్తే, మన విలువ తగ్గడమేగానీ మైలేజ్ రాదని, పార్టీ శ్రేయోభిలాషుల భావన.

ఒకవేళ ఇప్పుడు ఆంధ్రాకు వచ్చినా కూడా, ఎంత రేయింబవళ్ళు అందరూ కష్టపడితే, ఆ మచ్చ తొలుగుతుంది, ప్రజలు నమ్మి, పంచాయితీ ఎన్నికలలో ఓటు వేస్తారో అని, సొంత పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఎక్కువ మంది అభిమానులు జూనియర్ ఎంటీఆర్ పై ఆశలు పెట్టుకుంటున్నారు, చంద్రన్న తర్వాత పార్టీకి పేరు తెచ్చే యువ నాయకుడు, సీనియర్ ఎంటీఆర్ వారసుడు, జూనియర్ ఎంటీఆర్ అని కొంత మంది భావన. అయితే, చాలా కాలంగా ఆయనను దూరముగా పెట్టరు అని, లేదా అయనే దూరముగా ఉన్నారు అని అంటున్నారు. కాలమే నిర్ణయించాలి పార్టీ మరియు యువ నాయకుని భవిష్యత్తు అని అభిమానులు దేవునిపై ఆశలు పెట్టుకున్నారు.

గత అస్సెంబ్లీ 2019 ఎన్నికల ఫలితాలతో కూడా, తెలుగు దేశము పై నాయకులలో ఆత్మ విమర్శ మరియు మార్పు కనపడడము లేదు. ఒకే వర్గము పై అధారపడి, కొందరి తప్పుడు సలహాలతో నష్టపోతున్న విధానం ఇంకా అర్ధము కావడము లేదు. ఇప్పటికైనా అందరినీ కలుపుకు పోతూ, ఒక వర్గ ప్రాధాన్యాన్ని చేతలలో తగ్గింపు చూపిస్తూ, అందరితో కలసి మంచి నిర్ణయాలు తీసుకుని, మరలా పార్టీని సరైన దోవలో పెట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Note :
కొంతమంది చంద్రన్న జూమ్ మీటింగ్, అలాగే స్కూటీ మీద నెల్లూరు సాక్ష్యం పెట్టమంటే, ఫోటోలు కలిపాము.

మన ఇంట్లో చిన్న లు పెద్దలు కైనా, తప్పు ను ఒప్పు ను, మర్యాద తో మంచిగా చెప్పి మార్చుకోవాలి. అలాగే చంద్రన్న మరియు జగనన్నను కూడా. కోపాలు తెచ్చుకోవడం చేయవద్దు.

నాడు విపరీతంగా చంద్రన్నను పొగిడారు, నేడు ఈ స్ధితికి 23 సీట్లకు తెచ్చారు చివరకు. ఆయనను తిరిగి పైకి లేపాలి అంటే, వాస్తవం చెప్పాలి, ఉన్నది రాయాలి, అది బాధగా చేదుగా ఉన్నా కూడా తప్పదు.

ఇదే పరిస్థితి జగనన్న కు కూడా, తర్వాత రాకుండా చేయాలి. అవసరమైతె పొగడాలి, సుతిమెత్తగా తెగడాలి కూడా. అదే మంచి దగ్గర వ్యక్తులు లేదా విలేకరుల పని. బాధకలిగితే మన్నించాలి.

ఇలాంటి వాటిని భరించినప్పుడే, సరిచేసుకున్నప్పుడే, ఆ నాయకులు లేదా మనుషులు ఎల్లకాలం రాజకీయాలు లేదా జీవితము లో బాగుగా ఉంటారు. లేదంటే తర్వాత రోజుల్లో పతనమై, కనుమరుగు అవుతారు. ఒక నాయకునికి ఇంకొకరు ప్రత్యామ్నాయం లేకపోతే, ప్రజలే ఇబ్బందులు పడతారు.

అందుకే మంచి నాయకులు ఎప్పుడూ, తిడుతూ రాసే విలేఖరినే గౌరవిస్తూ, తమ తప్పులు తెలుసుకుంటారు. ఊరక అతిగా పొగిడే వారిని దూరముగా పెడతారు.  
5 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,387; 104 తత్వాలు (Tatvaalu) and views 225,592
Dt : 21-May-2020, Upd Dt : 21-May-2020, Category : Politics
Views : 942 ( + More Social Media views ), Id : 555 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , lokesh , telugu desam , carona lockdown , leadership bad remark , damaging party leaders confidence
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content