Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. అలాగే దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. ఈ చక్రం ఆగదు. జీవుడు దేనిని కోరాలి? మరి మనము దేనిని కోరుతున్నాము?
ఉదాహరణ మనకు సుఖము(ఆనందము) కావాలి అనుకున్నా, తర్వాత దుఃఖం(కష్టము) వస్తుంది. అలాగే దుఃఖం తర్వాత సుఖము వస్తుంది అని చాలా మందికి అనుభవమే.
ఉదాహరణలు చూద్దాము.
తాగుతూ ఉంటే, సుఖము ఉంది అనుకుంటారు కొంతమంది. తాగుతూ ఆస్తి అంతా హారతి కర్పూరము చేసిన, తర్వాత ఏమి లేకుండా పోతుంది. చివరకు తినడానికి కూడా అన్నము ఉండదు. అంటే దుఖము వస్తుంది.
కాలేజీ కి వెళ్ళకుండా, సినిమాలు షికార్లు వెళ్ళే వారు, ముందు సుఖము పొందినట్లుగా అనుకుంటారు. కాని, కాలేజీ నుంచి బయట పడ్డాక, చాలా కష్టాలు పడతారు.
జూదములో సుఖము ఉంది అనుకొని, అన్ని పోయాక, మరలా దుఖము వస్తుంది.
అలాగే దుఃఖం(కష్టము) తర్వాత సుఖము వస్తుంది.
కాలేజీ విధ్యార్ధి, కష్టపడి చదువుకొని, మంచి ఉద్యోగము తెచ్చుకున్నాడు. తర్వాత తను సుఖపడతాడు. ఒక కూలీ రోజంతా కష్టపడి, సాయంత్రము జీతము తీసుకుని, ఆనందముగా కుటుంబముతో గడుపుతాడు.
మరి, ఒక దాని తర్వాత ఒకటి వస్తే, దేనిని కోరాలి మానవుడు? సుఖమును కోరితే, తర్వాత దుఃఖం తప్పదు. కాబట్టి, తెలివిగలవాడు కష్టాలనే(దుఃఖం ను) కోరుకుంటారు, తర్వాత సుఖము వస్తుంది కాబట్టి.
అంటే, తనే కష్టాలను సంతోషముగా ఆహ్వానించినపుడు, ఇంక బాధలు అన్నమాట తను అనడు కదా. సంతోషముగా వాటిని అనుభవిస్తాడు.
కానీ భగవద్గీత ఏమి చెపుతుంది అంటే, దేనినీ కోరవద్దు, సమత స్థితిలో ఉండాలి అని. అంటే, కష్టము అయినా సుఖము అయినా, నాకు ఒకటే. నేను ఆత్మను, ఇవి నన్ను అంటలేవు, కేవలము శరీరము, మనసునకు చెందినవి మాత్రమే.
అన్నిటికీ సాక్షీభుతుడు అయి ఉండాలి, తమరాకు మీద నీటి బొట్టు లాగా. తన మంచి కర్మలు చేసుకుంటూ పోవాలి, ఎన్ని కష్టాలు సుఖాలు ఎదురైననూ, చలించక ఏమీ ఆశించక.
Bhagavad Gita: Chapter 5, Verse 22
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 5-22 ।।
ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు.
Bhagavad Gita: Chapter 6, Verse 7
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ।। 5-7 ।।
మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,328; 104 తత్వాలు (Tatvaalu) and views 221,512
Dt : 26-Oct-2019, Upd Dt : 26-Oct-2019, Category : General
Views : 2573
( + More Social Media views ), Id : 40
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
senses ,
mind ,
intellect ,
soul ,
happy ,
sorrow ,
jnani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.